Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సోదాలు
నవతెలంగాణ-బాలానగర్
హైదరాబాద్ బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్, డాక్యుమెంట్ రైటర్ జియాఉద్దీన్ భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. నిజాముద్దీన్ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. ఓ భూమికి సంబంధించి సేల్డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఇద్దరూ కలిసి రూ.75 వేలు లంచం అడిగినట్టు బాధితుడు షేక్ శరీఫ్ ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. సబ్రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఫైల్స్ను పరిశీలిస్తున్నారు.