Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీట మునిగిన కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రాలు
- పలుప్రాంతాల్లో 24 సెంటీమీటర్ల వాన
- జగిత్యాల జిల్లాలో మత్తడి దాటుతూ తండ్రీకొడుకు గల్లంతు
- గాలింపు చర్యల్లో దొరికిన మృతదేహాలు
- రోడ్లు తెగి నిలిచిన రాకపోకలు
- సిరిసిల్లలో డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు
- కరీం'నగరం'లో మంత్రి గంగుల వరద పర్యవేక్షణ
- రామగుండంలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల అన్ని గేట్లు ఎత్తివేత
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / కరీంనగర్ టౌన్/ సిరిసిల్ల టౌన్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై వరుణుడి ప్రతాపం.. ఊహించని వరద ముప్పును తెచ్చిపెట్టింది. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రాలు జలమయం కాగా.. పలు మండలాల్లో ఇండ్లల్లో వరదనీరు చేరి ఆయా ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. మూడు మండలాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో 15 నుంచి 17 సెంటీమీటర్ల మధ్య వర్షం పడటం గమనార్హం. ఉమ్మడి జిల్లాను వర్షం అతలాకుతలం చేయగా.. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలపై అధిక ప్రభావం చూపింది. ఇప్పటికే డీఆర్ఎఫ్ బృందాలు సిరిసిల్లలో సహాయక చర్యలు చేపట్టగా.. కరీంనగర్లో మంత్రి గంగుల ఆధ్వర్యంలో మున్సిపల్, పోలీసు సిబ్బంది వరద ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు.
కరీంనగర్లో ఇసిరిసిరి కొట్టింది..
కరీంనగర్ జిల్లాలో వర్షం ఇసిరిసిరి కొట్టింది. కొన్ని మండలాల్లో ఏకంగా 20సెంటీమీటర్లకుపైగానే వర్షం కురి సింది. అత్యధికంగా హుజూరాబాద్ మండలం బోర్నపల్లిలో 27.53సెంటీమీటర్లు, ఇల్లందకుంట మండలం 26.18 సెంటీమీటర్లు, జమ్మికుంట మండలం కొత్తపల్లిలో 24.30 సెంటీమీటర్ల భారీవర్షంకురిసింది. సైదాపూర్,శంకరపట్నం, గంగాధర, చిగురుమామిడి, రామడుగు మండలా ల్లో పలు చోట్ల 15 నుంచి 18సెం.మీ మధ్యకురిసింది. ఈఎడతెరి పిలేని వానతో హుజూరాబాద్, జమ్మి కుంట, ఇల్లంతకుంట, వీణవంక, కమలాపూర్ మండలాలు తడిసి ముద్దయ్యాయి. వాగులు, చెరువులు అలుగు పారుతున్నాయి.
కరీం'నగరం' అస్తవ్యస్తం
మురుగు కాలువల నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో కరీం'నగరం'లో వర్షపు నీరు రహదారులపై ప్రవహిస్తోంది. ఆర్టీసీ వర్క్షాప్ నుంచి రేకుర్తి వరకు రహదారి పూర్తిగా నీటి తో నిండిపోయి వాహనాల రాకపోకలు నిలిచాయి. సూర్య నగర్ కాలనీ పూర్తిగా నీట మునిగి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కార్లు నీటిలో తేలియాడుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లను వేరే మార్గం నుంచి మళ్లిస్తున్నారు. వర్ష పు నీరు వెళ్లేందుకు కాలువలు నిర్మించకపోవడంతోనే సమ స్యలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్-జగిత్యాల వెళ్లే రహదారిలో వీ పార్క్ హోటల్ వద్ద రహదారి నీట మునిగింది.
విద్యానగర్, జ్యోతినగర్, సూర్యనగర్ నుంచి వస్తున్న వర్షపు నీరంతా రోడ్డుపైకి చేర డంతో కరీంనగర్-జగిత్యాల రహదారి చెరువును తలపిస్తోంది. రాత్రి నుంచి వర్షం కురు స్తుండటంతో శాతవాహన వర్సిటీపరిధిలో మంగళవారంజర గాల్సిన పరీక్షలను వాయి దా వేశారు. కరీంనగర్ జిల్లాలో పాఠశాలలకు కలెక్టర్ కర్ణన్ సెలవు ప్రకటించారు. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునిల్రావు నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు.
నీట మునిగిన రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పట్టణమంతా జలమయ మైంది. పాతబస్టాండ్, పెద్దబజార్, వెంకంపేట రహదారి వాగును తలపించగా అక్కడే నీటి ప్రవాహానికి ఇద్దరు కొట్టు కుపోగా స్థానికులు కాపాడారు. చవితి కోసం సిద్ధం చేసిన వినాయకుడి విగ్రహాలు వరదలో కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో ప్రొక్లెయిన్ సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పట్టణంలోని ప్రగతినగర్, సాయి నగర్, అంబికానగర్, శాంతినగర్, గాంధీనగర్లో ఇండ్లల్లోకి వరద నీరుచేరింది. కొత్త కలెక్టరేట్ ప్రాంగణంలోనూ భారీగా వర్షపు నీరు చేరింది. ఇదే సమయంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్హెగ్దే సహాయక చర్యల్లో నేరుగా పాల్గొన్నారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ కంట్రోల్రూమ్నూ ఏర్పాటుచేశారు. అత్యవసరసేవల కోసం 9398684240 నెంబర్కు సంప్రదించాలని సూచించారు.
సిరిసిల్లకు డీఆర్ఎఫ్ బృందాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తచెరువు మత్తడి దూకడం వల్ల సిరిసిల్ల-కరీంనగర్ రహదారిలోని దుకాణాల్లోకి నీరు చేరింది. కాళేశ్వరం 9వ ప్యాకేజీ సొరంగంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. సిరిసిల్లలో వర్ష బీభత్సంపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. మంత్రి ఆదేశాలతో రెండు డీఆర్ఎఫ్ బృందాలు హైదరాబాద్ నుంచి బోట్లు, ఇతర సహాయ చర్యల పరికరాలతో సిరిసిల్లకు చేరుకున్నాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మానేరు, గోదావరి నదు లపై ఉన్న ప్రాజెక్టుల పూర్తిస్థాయి గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. కరీంనగర్జిల్లా కేంద్రంలోని ఎల్ఎమ్డీ లోకి మోయతుమ్మెద వాగు నుంచి 77వేల క్యూసెక్కులు, మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి వస్తున్న లక్ష క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు 18గేట్లు ఎత్తి దిగువకు1.77లక్షల క్యూసె క్కుల నీటిని వదులుతున్నారు. మానేరు నదిపై 2టీఎంసీల సామర్థ్యంతో ఉన్నఎగువమానేరు డ్యాంఅలుగు దూకుతుం డగా 24టీఎంసీల సామర్థ్యం ఉన్న మధ్యమానేరు డ్యాం సైతం 22గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు.
ఈ ప్రాజెక్టుకు మూలవాగు నుంచి ఏకంగా 60వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. గోదావరిపై ఎగువ ఎస్సారెస్పీ నుంచి, స్థానిక వాగుల నుంచి వరద పోటెత్తడంతో 21టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 2లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్లు ఎత్తి దిగువకు అంతే మొత్తంలో వదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎగువన నిర్మించిన సుందిళ్ల, అన్నారం బ్యారీజీ 76గేట్లు ఎత్తి గోదావరిలోకి వదులుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం ఎఫెక్ట్
- వేములవాడ పట్టణానికి వెళ్లే దారిలో మూలవాగుపై నిర్మిస్తున్న అదనపు వంతెన వరద ఉధృతికి కూలిపోయింది. రెండేండ్లలో బ్రిడ్జి పూర్తి కాకముందే ఇలా వరద ఉధృతికి కొట్టుకుపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
- రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వర్రావునగర్ సమీపంలో కాలువ తెగడంతో వరద నీరు ఇండ్లకు చేరింది. స్థానిక ఎస్ఐ సౌమ్యరెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని వరదబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- మార్గమధ్యలో వరదలో చిక్కుకున్న బాలింతను రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
- జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గోదావరి పరివాహక ప్రాంతంలో చిక్కుకున్న ఇద్దరు గొర్రెల కాపరులను రెస్క్యూటీం కాపాడింది.
1 జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని నందిపల్లె గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు ఎక్కలదేవి విష్ణు(5) మత్తడి దాటుతుండగా వరద ఉధృతికి గల్లంతయ్యారు. తొలుత విష్ణు మృతదేహం లభ్యం కాగా, కొద్ది సేపటికి తండ్రి శవమూ లభించింది.
- వర్షధాటికి మానకొండూర్ చెరువు సమీపంలో రోడ్డు పూర్తిగా చెడిపోయింది. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం కారు, బైక్ అదుపు తప్పి ఎదురెదురుగా ఢకొీని అక్కడికక్కడే ఓ వ్యక్తి మరణించాడు.