Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలనీ, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకో వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశిం చారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై మంగళవారం ఢిల్లీ నుంచి ఆయన సమీక్షించారు. సీఎస్తో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ వానల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో గ్రామాలు, మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే విద్యుత్తు, రోడ్లు, నాలాలు తదితర రంగాల పరిస్థితుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ , పంచాయతీరాజ్, రోడ్లు భవనాల, విద్యుత్ శాఖల అధికారులు కింది స్థాయి వరకు తమ ఉద్యోగులను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాజెక్టులు, చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో, లోతట్టుప్రాంతాల ప్రజలకు ఇబ్బం దులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నీటి పారుదలశాఖ అధికారులు అలర్ట్గా ఉండాలని సీఎం కోరారు. ఒకవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ, మరోవైపు వరద ముంపు ప్రాంతా లలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకునేందుకు ప్రజా ప్రతినిధులు వారి, వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా ఉండాలనీ, వర్ష ప్రభావిత వరద ముంపు ప్రాంతాల ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు.
కలెక్టర్లతో సీఎస్ సమీక్ష : సీఎంకేసీఆర్ ఆదేశాలమేరకు సోమేశ్ కుమార్ వర్ష ప్రభావిత 20జిల్లాల కలెక్టర్లతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీ క్షించారు. ప్రతిజిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాల్లోని అధికారులందరూ విధు ల్లో ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించాలని తెలిపారు. అన్ని జలాశయాలపట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా చెరు వుల కట్టల పటిష్టత కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే, ఎన్.డి.ఆర్.ఎఫ్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సోమేశ్ కుమార్ ఆదేశించారు. ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటల పరీవాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్ కార్యదర్శి సందీప్ సుల్తానియా లతోపాటు తదితరులు పాల్గొన్నారు.