Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు బుధవారం నిర్వహించిన డీసెట్ రాతపరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7,591 మంది దరఖాస్తు చేస్తే, 5,818 (76.64 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. డీసెట్ రాతపరీక్ష ఆన్లైన్లో ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. తెలుగు మీడియంకు 3,007 మంది దరఖాస్తు చేయగా, 2,255 (74.99 శాతం) మంది, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంకు 4,584 మంది దరఖాస్తు చేస్తే, 3,563 (77.73 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఈనెల 11న ప్రాథమిక కీని జారీ చేస్తామని వివరించారు.