Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయుల సర్దుబాటును నిలిపేయాలని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 1,024 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియను చేపట్టాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతుల లేమికి టీచర్లను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. పారిశుధ్యంతోసహా ప్రతి పనినీ స్కూల్ గ్రాంట్లతో ముడిపెట్టి మాట్లాడ్డం సరైంది కాదని పేర్కొన్నారు. జులై 27,28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పించిన పీఆర్సీ బకాయిల బిల్లులు మంజూరు చేయాలని కోరారు. సీపీఎస్ డీఏ బకాయిల బిల్లులూ మంజూరు చేయాలని సూచించారు. కోవిడ్ నిబంధనలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని తెలిపారు.