Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల వేతన బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత విద్యాసంవత్సరంలో ఏప్రిల్, మేతోపాటు ప్రస్తుత విద్యాసంవత్సరంలో జూన్, జులై వేతనాలను విడుదల చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.16.15 కోట్లు మంజూరు చేశామని వివరించారు. వేతన బకాయిలు విడుదల చేయడం పట్ల ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (జీసీసీఎల్ఏ-475) రాష్ట్ర అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ హర్షం ప్రకటించారు. డిగ్రీ కాలేజీల్లో 815 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారని తెలిపారు. వేతన బకాయిలు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, కమిషనర్ నవీన్ మిట్టల్కు ధన్యవాదాలు ప్రకటించారు.