Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గ్రోశక్తిప్లస్' ఎరువుల ఆవిష్కరణలో కోరమాండల్ వైస్చైర్మెన్ అరుణ్ అలగప్పన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయదారులు, రైతులకు అత్యుత్తమ ఉత్పత్తులను అందిస్తామని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు అరుణ్ అలగప్పన్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని హోటల్ మారియట్లో ప్రముఖ రైతులు, ఎరువుల డీలర్లు, ఇతరుల సమక్షంలో 'గ్రోశక్తిప్లస్' ఎరువులను ఆవిష్కరించారు. కోరమాండల్, మన గ్రోమోర్ సెంటర్, అగ్రోనమిస్ట్ బృందం, న్యూట్రిక్లినిక్స్ ద్వారా రైతులకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను రైతులకు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. 1961 నుంచి దేశంలో రైతులకు సాంకేతిక ఎరువులను అందిస్తున్నామని చెప్పారు.పంటల ఉత్పత్తి, దిగుబడులను పెంచడంలో కోరమాండల్ కాంపెక్స్ ఎరువులది కీలకపాత్ర అని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక పోషకాలు, పోషక ఆధారిత సచ్ఛమైన సేంద్రియ ఎరువులను అందించడం ద్వారా రైతులకు సేవ చేస్తున్నామన్నారు. గ్రోశక్తిప్లస్తో తమ పంటలకు పూర్తి సమతుల్య పోషణ చేరుతుందని, తద్వారా రైతులకు ప్రతిఫలాలు అందుతాయని గుర్తుచేశారు. గ్రోమోర్ బ్రాండ్ అత్యంత నమ్మకమైనదన్నారు. గ్రోశక్తిప్లస్ ఒక ఉన్నతమైన కాంప్లెక్స్ ఎరువు అని, ఎన్ఫోస్ టెక్నాలజీ, జింక్తో కలిసి ఉంటుందన్నారు.
తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు తదితర పంటలకు అనుకూలమని గుర్తుచేశారు. మొక్కకు మరింత ఫాస్పరస్ అందేలా చేస్తుందన్నారు. పంటల పెరుగుదల కూడా దిగుబడిని అధికం కావడానికి ఉపయోగపడుతుందన్నారు. జింక్ మూలంగా పంటలకు తెగుళ్ల నుంచి ముందస్తు రక్షణ దొరుకుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ సమీర్ గోయల్, ఇతరులు పాల్గొన్నారు.