Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసు విచారణలో బుధవారం నటుడు దగ్గుబాటి రానాను ఈడీ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ విచారణలో పలు ప్రశ్నలతో రానాను ఈడీ అధికారులు ఉక్కిరి బిక్కిరి చేశారని తెలిసింది. ఈ సందర్భంగా డ్రగ్స్ రవాణాదారుడు కెల్విన్ను రప్పించి రానా ఎదుట ఉంచి మరీ విచారించారు. ఇప్పటి వరకు దర్శకుడు పూరీ జగన్నాధ్, నటి చార్మీ, రకుల్ప్రీత్సింగ్, నందులను విచారించిన ఈడీ అధికారులు తాజాగా రానాను సైతం పలు కోణాల నుంచి విచారించారు. ముఖ్యంగా రానాకు చెందిన రెండు బ్యాంకు అకౌంట్లు వివరాలను తెప్పించి అందులో అనుమానిత డబ్బు లావాదేవీలు, విదేశీ అకౌంట్లకు డబ్బుల బదిలీపై సీరియస్గా ఈడీ అధికారులు దృష్టి సారించారు.