Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పంటలకు సంబంధించిన సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. సదరు సమాచారం వంద శాతం కచ్చితంగా ఉండాలని సూచించారు. బుధవారం హైదరాబాద్లోని వ్యవసాయశాఖ కమిషనరేట్లో వానాకాలం పంటల విస్తీర్ణం, పంటల సరళి, ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు, యాసంగి విత్తన ప్రణాళికపై ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ కొండబాల కోటేశ్వర్రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఎఫ్సీఐ జీఎం దీపక్ శర్మ, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు. పంటల నమోదు అనేది పది రోజుల్లో సంపూర్ణంగా పూర్తి కావాలని సూచించారు. యాసంగిలో ఆరుతడి పంటలైన వేరుశనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, పొద్దు తిరుగుడు వంటి పంటలతోపాటు పప్పు శనగను ప్రోత్సహించాలని కోరారు. వేరుశనగ విత్తనాలను రాయితీపై సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు.