Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 11 మంది అధ్యాపకులకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు కళశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. రామచంద్రం (సీతాఫల్మండి), రాజేందర్ (ఖైరతాబాద్), గీతాలక్ష్మీ పట్నాయక్ (నారాయణగూడ), వై సత్యనారాయణ (జగిత్యాల), జి రాజారెడ్డి (వరంగల్), వి. శ్రీనివాస్ (అగ్రహారం), నిఖత్ అంజుమ్ (శేరిలింగంపల్లి), ఎ నర్సయ్య (జనగామ), ఎండీ జకీరుల్లా (ఖమ్మం), కె మల్లేశం (హన్మకొండ), కె ప్రభు (ఇబ్రహీంపట్నం) పదోన్నతులు పొందినవారిలో ఉన్నారు. ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు పొందిన అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వ కాలేజీల గెజిటెడ్ అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ సంజీవయ్య, కె సురేందర్ రెడ్డి ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.