Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతిపక్ష పార్టీల సమావేశం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఈ మేరకు సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత స్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఈనెల 20 నుంచి 30 వరకు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, టీటీడీపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (పోటు రంగారావు), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (సాదినేని వెంకటేశ్వరరావు), ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఎస్యూసీఐ(సీ), బీఎస్పీ, జనసేన, వైఎస్ఆర్టీపీ పార్టీలను ఆహ్వానించామని వివరించారు.