Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కలు నాటిన శశిథరూర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ శశిథరూర్ నేతత్వంలోని సభ్యులు శిల్పారామంలోని రాక్ హైట్స్ లో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్కుమార్ను శశిథరూర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. గ్లోబల్ వార్మింగ్ను అరికట్టాలంటే మొక్కల పెంపకం అవసరమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా పర్యావరణానికి మేలు కలిగించేందుకు మొక్కలు నాటే అవకాశం లభించినందుకు శశిథరూర్ సంతోషం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకెళ్తుందని ఎంపీలు రంజిత్ రెడ్డి, సయ్యద్ జాఫర్ ఇస్లాం అన్నారు. సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ ముందుకెళ్తున్నదనీ, 16 కోట్లకు పైగా ఇప్పటివరకు మొక్కలు నాటడం జరిగిందని ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు.