Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలి
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలనీ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి యత్నించిన విద్యార్థులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.
ఆ కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలు రూ.3,850 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడుల హేతుబద్ధీకరణను ఆపాలని కోరారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లకు లక్షల రూపాయల డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజు వసూళ్లను నియంత్రించాలని తెలిపారు. విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు పిలుపునిచ్చారు.