Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతిని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ''ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె'' అనే కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం అన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని అన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా పెంచేందుకు వీలుగా తెలంగాణ సాహితీ వేత్తలు కృషిని కొనసాగించాలని సీఎం కోరారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషి చేస్తున్న కవులు, రచయితలను గుర్తించి వారికి కాళోజి పేరున పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవిస్తున్నదని అన్నారు. ''పుటుక నీది. చావు నీది. బతుకంతా దేశానిది'' అని నినదించిన కాళోజి జీవితం అంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందన్నారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరం అందుకుంటున్న, ప్రముఖ కవి, రచయిత పెన్నా శివరామ కృష్ణను సీఎం కేసిఆర్ అభినందించారు.