Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ను ప్రశంసించిన పార్లమెంటరీ కమిటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఐటీ రంగం అభివద్ధి, ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీల వినియోగంపై పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. గత రెండు రోజులుగా హైదరాబాద్లో పర్యటిస్తున్న ఇక్కడ మౌలిక వసతులతోపాటు పలు అంశాలపై అధ్యయనం నిర్వహిస్తున్నది. ఈమేరకు బుధవారం ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, విజన్పై స్థాయి సంఘానికి మంత్రి కేటీఆర్ వివరాలు అందించారు. రానున్న కాలంలో వినూత్న కార్యక్రమాలు కొనసాగితే హైదరాబాద్ అద్భుతమైన అభివద్ధి సాధిస్తున్నదని కమిటీ అభిప్రాయ పడింది. ఇప్పటికే ఆదర్శవంతమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్న తెలంగాణ పద్ధతులను, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితు లకు అనుగుణంగా అమలు చేసే అంశంపైన తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామన్నారు.సమావేశానంతరం కమిటీ అధ్యక్షుడు శశిథరూర్తో పాటు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపి.. జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కేటీఆర్, ఐటీ శాఖ విభాగాల అధిపతులు పార్లమెంట్ సంఘానికి వివరించారు.