Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నూతన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాగులపల్లి వెంకటేశ్వర్లు బుధవారం రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చైర్మెన్ అల్లం నారాయణకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మీడియా అకాడమీ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేయడానికి కృషిచేయాలని కోరారు. అకాడమి భవన నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కార్యదర్శికి సూచించారు.ఈ సమావేశంలో మీడియా అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ ఎమ్. పూర్ణచందర్ రావు, మేనేజర్ ఎ. వనజ, సూపరింటెండెంట్ శ్రీలతాదేవి, ప్రసాద్, రాజ్ కమార్, సంతోష్, నర్సింహ్మరావు, తదితరులు పాల్గొన్నారు.