Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తాజాగా 329 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఒకరు మరణించారు. బుధవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.41 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 78,421 మందికి టెస్టులు చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో 70,526 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 7,895 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,598 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,497 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కోలుకున్న 307 మందిని డిశ్చార్జి చేశారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 81 మందికి కరోనా సోకింది. అతి తక్కువగా జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వ్యాధి బారిన పడ్డారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదు.
21 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో సోమవారంతో పోలిస్తే మంగళవారం 21 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, మేడ్చల్- మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు పెరిగాయి.
10 జిల్లాల్లో తగ్గిన కేసులు...
జీహెచ్ఎంసీతో సహా 10 జిల్లాల్లో మాత్రమే కేసులు తగ్గాయి. జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మెదక్, ములుగు, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో తక్కువగా నమోదయ్యాయి.
జనగామ, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రం వరసగా రెండో రోజూ కూడా కేసుల్లో పెరుగుదల కానీ, తగ్గుదల కాని కనిపించలేదు.