Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంటా వార్పుతో గ్రామస్తుల నిరసన
నవతెలంగాణ-తాంసి
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల్ నాగాపూర్ నుంచి కప్పర్ల వరకు రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారడంతో పాటు మోకాళ్ల లోతు బురద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ప్రమాదాలకు గురవుతుండటంతో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని 3 రోజుల కిందట గ్రామస్తులు రోడ్డుపై మొక్కలు నాటి నిరసన తెలిపారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంతో బుధవారం ఎంపీటీసీతో పాటు గ్రామస్తులు, యువజన సంఘం సభ్యులు రోడ్డుపై వంటా వార్పు చేశారు. అక్కడే చేపలు పట్టారు. బోథ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ కె.సంతోష్ మాట్లాడుతూ.. 15 ఏండ్ల కిందట రోడ్డు నిర్మించారని, అప్పటి నుంచి కనీస మరమ్మతులు చేపట్టలేదని అన్నారు. రాథోడ్ బాపురావ్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, లేనిపక్షంలో గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో గ్రామస్తులు అశోక్, నారాయణ, బుజ్జన్న, భూమన్న, అరుణ్, ప్రవీ ణ్, ప్రశాంత్, రాములు, పొచ్చన్న, గజానంద్ తదితరులు పాల్గొన్నారు.