Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలన, దొరలు, జాగీర్దారులు, రజాకార్లకు వ్యతిరేకంగా ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వీరోచితంగా పోరాటాలు నిర్వహించినట్టు తెలిపారు. అలాంటి చరిత్ర గల పోరాటాన్ని నేడు కొన్ని పార్టీలు వక్రీకరించేందుకు యత్నిస్తున్నాయన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు విమోచన, విముక్తి దినోత్సవం పేరిట సభలు, సమావేశాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయంగా లబ్ది పొందేందుకే ఆ రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. బీజేపీ మత పోరాటంగా చూపిస్తూ ప్రజల మధ్య వైరుధ్యాన్ని పెంచేందుకు యత్నిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు నూకల జగదీష్ చంద్ర, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, రవినాయక్, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఎమ్డి.అంజద్, నాగేందర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.