Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరణి రద్దు చేయాలి : రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
'ధరణి'ని రద్దు చేసి, రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 'ధరణి' కొన్ని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం రూపొందించబడిందనీ, దానివల్ల సామాన్యులకు సమస్యలే తప్ప, ప్రయోజనాలు ఏమీ లేవన్నారు. తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన సోమవారం హయత్ నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఎన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్టర్ చేయోద్దని గతేడాది ఆగస్టు 26న తెలంగాణ స్టేట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజి శేషాద్రి రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్లకు మెమో ద్వారా ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఈ ఆదేశాలు హైకోర్టు తీర్పు ఇచ్చినా, ప్రభుత్వం స్పందించట్లేదన్నారు. భూముల గురించి తెలియని సంస్థకు ధరణి పోర్టల్ అప్పగించి బలవంతంగా రైతులు, రియల్టర్లపై రుద్ది ప్రభుత్వం కొత్త సమస్యలు సష్టించిందని విమర్శించారు. ధరణిలో 20 రకాల సమస్యలు కారణంగా రిజిస్ట్రేషన్లు కావడం లేదన్నారు. తక్షణం ధరణి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించాలనీ, సామాన్య మధ్య తరగతి ప్రజలకు ప్లాట్స్ ధరలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు కార్పొరేట్ వ్యాపారుల అభివద్ధి కోసమే ధరణి నిబంధనలు తీసుకురావడం దురదష్టకరమన్నారు. రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ, సొంత భవనానికి స్థలం కేటాయించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకపోతుల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావు తదితరులు పాల్గొన్నారు.