Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ కోటాలో కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీ పదవిపై తమిళి సై
- సీఎంతో ఎలాంటి విబేధాల్లేవని వ్యాఖ్య
- గవర్నర్గా రెండేండ్లు పూర్తయిన నేపథ్యంలో విలేకర్లతో ఇష్టాగోష్టి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన పాడి కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీ పదవిపై తానింకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని రాష్ట్ర గవ ర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. ఈ విషయంలో తనకు మరింత సమయం కావాలని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. 'కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపిన మాట వాస్తవం. అయితే సామాజిక సేవా విభాగం కింద క్యాబినెట్ ఆయన పేరును సిఫారసు చేసింది. అందుకే ఆయన పదవి విషయాన్ని పరిశీలనలో ఉంచాం...' అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం తమిళి సై... హైదరాబాద్లోని రాజ్భవన్లో విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గవర్నర్గా తన విధుల నిర్వహణ, అనుభవాలు తదితర అంశాలకు సంబంధించిన ఫొటో ఫీచర్లతో 'వన్ అమాంగ్ అండ్ అమాంగెస్ట్ ద పీపుల్' పేరిట రూపొందించిన కాఫీ టేబుల్బుక్ను ఆమె ఈసందర్భంగా ఆవిష్క రించారు. అనంతరం మాట్లాడుతూ... సీఎం కేసీఆర్తో తనకు సత్సంబం ధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో ఎలాంటి వివాదాల్లేవని చెప్పారు. అయితే పరిస్థితిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకుపోతున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాలకు వెళ్లి ప్రజాదర్బార్లు నిర్వహించడం ద్వారా వారి సమస్యల పరిష్కారానికి కృషఙ చేయాలని నిర్ణయించినప్పటికీ కరోనా వల్ల అది సాధ్యం కాలేదని వివరించారు. ఏ పదవిని అలంకరించినా... మంచి పేరు తెచ్చుకోవాలంటూ తన తల్లి చెప్పేదని అన్నారు. నూతన రాష్ట్రమైన తెలంగాణకు గవర్నర్గానూ, పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్రమంలో ఈ రెండింటినీ తాను నవజాత శిశువుల్లాగా భావిస్తున్నానని చెప్పారు. ఒక గైనకాలజిస్టుగా ఈ రెండింటినీ కవల పిల్లలుగా చూస్తున్నానని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ చేరే విధంగా తాను చొరవ చూపానని వివరించారు. తన అధికార నివాసం రాజ్ భవన్ కాదనీ, అది ప్రజాభవన్ అని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ... రాష్ట్ర గవర్నర్గా తమిళిసై వచ్చిన తర్వాత రాజ్ భవనకు సాంస్కతిక శోభ, దక్షిణాది ఫ్లేవర్ వచ్చిందని అన్నారు. గవర్న ర్గా ఆమె నియమితులైన వెంటనే ఇక్కడి ప్రజల్లో కుతూహలం ఏర్పడిం దని, ఆమె ఆహార్యం, వ్యవహార శైలి రాజ్ భవన్కు శోభ తెచ్చాయని అన్నారు. నిజానికి గవర్నర్ పదవి చాలా సున్నితమైంది కేంద్రం, రాష్ట్రంలో వేర్వేరు ప్రభుత్వాలున్న ప్పుడు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని వ్యవస్థలు అందుబాటులో లేనప్పుడు రాజ్ భవన్ న్యాయవ్యవస్థలా పని చేయాలని అన్నారు. ప్రజలు సమస్యలను నివేదించుకునేందుకు అప్పిలేట్ అథారిటీలా ఆ భవన్ ఉండాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఏపీ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్, బండారు శ్రీనివాసరావు, గౌరీ శంకర్ తదితరులు పాల్గొని గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు.