Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్శాఖ రోడ్లకు వెంటనే మరమ్మ తులు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉన్నతాధి కారులను ఆదేశించారు. పంచాయతీరాజ్శాఖ లోని పలు అంశాల మీద మంత్రి, హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదా యంలోని తన క్యాంపు కార్యాలయంలో సంబం ధిత ఉన్నతాధికా రులతో బుధవారం సమీక్షిం చారు. ఈ సందర్భం గా మంత్రి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలోని పదోన్నతులు, పోస్టింగులు, ఇటీవల పదోన్నతులు పొందిన డీపీవోలు, ఎంపీడీఓలకు పోస్టింగులు, కారో బార్లు, పంపు మెకానిక్ల సమస్యలు వంటి పలు అంశాలపై ఉన్నతాధికా రులతో చర్చించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగానే దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలని సూచిం చారు. ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని అధిరారులను అడిగి తెలుసు కున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఇప్పటికే చేపట్టిన పదోన్నతులు పొందిన 57మంది డీపీవోలు, ఎంపీడిఓలకు ఖాళీలను బట్టి పోస్టిం గులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీర్లకు పదోన్నతులు కల్పిం చాలనీ, ఇందుకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి చెప్పారు. మిగిలి ఉన్న అతికొద్ది వైకుంఠ ధామాలు, డింపింగ్ యార్డులను సాధ్యమైనంత తొందరలో పూర్తయ్యే విధంగా చూడాలని మంత్రి అధికా రులను ఆదేశించారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.