Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా
- పలుచోట్ల అడ్డుకున్న పోలీసులు.. నాయకుల అరెస్ట్
నవతెలంగాణ- విలేకరులు
పెండింగ్లో ఉన్న రూ.3,850 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు రోడ్డెక్కారు.ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని నినదిస్తూ కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. ఉద్యోగ ఖాళీలను, భర్తీ చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కారించాలన్నారు. ఈ క్రమంలో పలుచోట్ల పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ కు వినతిపత్రం అందజేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రశాంత్ ఆధ్వర్యంలో నిరసన తెలి పారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. యాదాద్రిభువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనం తరం కలెక్టర్కు వినతిపత్రం అందజేసేందుకు వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పలువుర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విద్యార్థులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లను ముట్టడించారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పలువురు విద్యార్థుల ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, బాలికల కళాశాలకు పక్కా భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ, డీవై ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయా లని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిరసన దెలిపారు.