Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయోధ్యరెడ్డి విమర్శ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హుజూరాబాద్ ఉపఎన్నిక వాయిదా వేయడం, పాడి కౌశిక్రెడ్డి ఇస్తామన్న ఎమ్మెల్సీ ప్రతిపాదన వెనక్కి పోవడం వెనక టీఆర్ఎస్, బీజేపీ పార్టీల కుట్ర దాగి ఉన్నదని టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి విమర్శించారు. ప్రధానిని సీఎం కేసీఆర్ కలవగానే ఎన్నికలు వాయిదా పడ్డాయని ఆయన గుర్తు చేశారు. ఈ రెండు పార్టీ లోపాయికారి ఒప్పందం దీంతో బహిర్గతమైందన్నారు. గురువారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి రాహుల్గాంధీ, రేవంత్పై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దుబారు పాస్ పోర్టు బ్రోకర్, దుబారు పాండు జీవన్రెడ్డి పార్క్ హయత్లో లగ్జరీషూట్లో ఏం చేస్తుంటారో ప్రజలకు తెలుసునని విమర్శించారు. గజ్వేల్ కేసీఆర్ రాజీనామా చేస్తే...రేవంత్రెడ్డికి పోటీకి సిద్ధమని సవాల్ విసిరారు.