Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం పాలపాడు అడ్డరోడ్డువద్ద భర్తతో బైక్పై వెళుతున్న మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన మహిళలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని, ఈ ఘటనపై సత్వర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఐద్వా గ్రేటర్ హైద్రాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష కార్యాదర్శులుఎ.పద్మ, కె.నాగలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్తెనపల్లికి చెందిన దంపతులు శుభకార్యానికి వెళ్లి వస్తుండగా మాటు వేసిన దుండగులు బైక్కు చెట్టు కొమ్మలు అడ్డంగా పెట్టి బైక్ను ఆపి భర్తను కొట్టి చెట్టుకు కట్టేసి భార్యను పొదలలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం జరపడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోందని, రాత్రి 9.30 గంటలకు భర్తతో వెళుతున్నా మహిళలకు రక్షణ లేకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. పాలపాడు అడ్డదారిలో గతంలో కూడా మద్యం సేవించిన మందు బాబులు మహిళలను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు అనేకం ఉన్నాయని, ఇలాంటి ఘటనలు జరగకుండ గతంలోనే ప్రభుత్వం రక్షణ చర్యలు చేపడితే ఈ ఘటన జరిగేది కాదనీ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని ఇకనైనా నివారించాలని, బాధితురాలికి తగిన న్యాయం చేయాలని, నేరానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.