Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ ప్యాసింజర్ వాహన శ్రేణి ఆటోమొబైల్ సంస్థ మ్యారీస్ గ్యారేజెస్ రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ గురువారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. తమ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆ దిశగా అన్ని చర్యలూ చేపడుతున్నామని వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ వాహన (ఈవీ) విధానానికి మంచి ఆదరణ లభిస్తున్నదని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఈవీల కొనుగోళ్లు జోరందుకుంటున్నాయని చెప్పారు.
కాళోజీనికి నివాళులు...
ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంత్రి... ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ అచ్చ తెలుగుదనానికి, యాసకు ఆయన ఎంతో సేవ చేశారని తెలిపారు. తన కలాన్నే ఆయుధంగా మార్చుకుని... సాహిత్య సమరాన్ని సాగించారని పేర్కొన్నారు.