Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరే గడువును ఈనెల 13 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు పాలిసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 120 కాలేజీల్లో 29,054 సీట్లుంటే, 22,367 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. సీట్లు కేటాయించిన విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం గురువారంలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. కాలేజీల్లో చేరే గడువును ఈనెల 13 వరకు పొడిగించామని వివరించారు. ఇతర వివరాల కోసం https://tspolycet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.