Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ మంజూరులో నిబంధనల్ని సడలించాలనీ, సాంఘీక సంక్షేమ వసతి గృహాల నిర్వాహణలో మరిన్ని సంస్కరణలు అవసరమని షెడ్యూల్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. గురువారం హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఆసక్తి చూపే విద్యార్థులకు రూ.20లక్షల చొప్పున ప్రభుత్వం ఉచితంగా సాయపడుతుందన్నారు. ఇలాంటి గొప్ప పథకం దేశంలో మరెక్కడా లేదని చెప్పారు. ఈ పథకం కింద ఎంపికయ్యే విధ్యార్థుల్లో ఎస్సీలు తక్కువగా ఉన్నారని తెలిపారు. మానవతా దృక్పథంతో పరిశీలించి సాధ్యమైనంత సరళమైన పద్దతుల్లో ఎంపిక జరిగితే బాగుంటుందన్నారు. సాంఘీక సంక్షేమ వసతి గృహాల నిర్వాహణలో మరిన్ని సంస్కరణలు అవసరమనీ, విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి విజరుకుమార్, కమిషనర్ యోగితారాణ, అధికారులు హన్మంతు నాయక్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుద్దిస్టు మైనారిటీస్ రైట్స్ ఆర్గనైజేషన్ లోగోను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ అధ్యక్షులు శ్యాంరెడ్డి, నాయకులు ఆశీష్, మద్దిలేటి, వెంకటస్వామి, అనంత్రాజ్ తదితరులు పాల్గొన్నారు.