Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతి గొంతు కోసిన ఉన్మాది
- సూర్యాపేట జిల్లాలో దారుణం
- పరిస్థితి విషమం
- నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలింపు
నవతెలంగాణ - నేరేడుచర్ల
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో దారుణ ఘటన జరిగింది. తనను కాదని మరో వ్యక్తితో పెండ్లికి సిద్ధమైందన్న కక్ష పెంచుకున్న ఓ యువకుడు యువతి గొంతు కోశాడు.తీవ్రంగా గాయపడిన బాధితురా లిని స్థానికులు 108లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. నేరేడుచర్ల ఎస్ఐ విజరు ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చేర్కూంపాలెం గ్రామానికి చెందిన సానిగొమ్ము శ్రీను గ్రామాలు తిరుగుతూ ఆయుర్వేద మందులు అమ్మి జీవిస్తున్నాడు.ఆరు నెలల కిందట కుటుంబంతో వచ్చి నేరేడుచర్లలోని రాజీవ్నగర్ ప్రాంతంలో గుడిసె వేసుకొని నివాసముంటున్నాడు. ఆయనకు ఓ కుమార్తె(18) ఉంది. అదే కాలనీకి చెందిన బాల సైదులు కొన్ని రోజులుగా తనను పెండ్లి చేసుకోవాలని ఆ యువతి వెంటబడు తున్నాడు. కానీ యువతి అతన్ని అన్నయ్య అని పిలిచేది. ఈ క్రమంలో యువతికి పెండ్లి సంబంధం కుదిరింది. విషయం తెలుసుకున్న యువకు డు తననే పెండ్లి చేసుకోవాలని, లేదంటే గొంతు కోస్తానని బెదిరించా డు.అవేమీ పట్టించుకోని యువతి గురువారం బట్టలు ఉతికేందుకు సమీపంలోని కాలువ వద్దకు వెళ్లింది. ఇది గమనించిన సైదులు అక్కడికెళ్లి ఆమెను ఇసుకలో పడేసి బ్లేడ్తో గొంతు కోశాడు. యువతి వెంట ఉన్న వారు కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన బాధితురాలిని స్థానికులు 108లో మిర్యాలగూడ ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు.