Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజస్థాన్కు చెందిన వర్ధమాన్ మహావీర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (కోటా) మధ్య అన్ని డిగ్రీ కోర్సుల మెటీరియల్ను పరస్పరం అందించుకోవడానికి అవగాహన ఒప్పందం కుదిరింది. రానున్న రోజుల్లో కోర్సుల రూపకల్పన, పరిశోధన వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి. అంబేద్కర్ వర్సిటీ వీసీ కె సీతారామారావు సమక్షంలో రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి, వర్ధమాన్ మహావీర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ రతన్లాల్ గోదారా గురువారం ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్ సుధారాణి, సోషల్ సైన్స్ డీన్ ఘంటా చక్రపాణి, డైరెక్టర్ పి మధుసూదన్రెడ్డి, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్రావు, టీఎంఐ గ్రూప్ చైర్మెన్ టి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు.