Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఘాతుకానికి పాల్పడిన దుండగులు
- పుస్తెలతాడుతోపాటు నగదు అపహరణ
నవతెలంగాణ-చేర్యాల
ఒంటరిగా నివసిస్తున్న మహిళ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి చొరబడి.ఆమెను హతమార్చి పుస్తెలతాడుతో పాటు నగదును ఎత్తుకెళ్లారు.ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలో గురువారం జరిగింది.స్థానికులు,చేర్యాల సీఐ బీమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి,ఎస్ఐ గోనెం రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం.గ్రామానికి చెందిన దేవరాయ ఎల్లమ్మ(45),బాలయ్య దంపతులకు ఇద్దరు కుమార్తె లు.అయితే కొన్నేండ్ల కిందట బాలయ్య మృతిచెందాడు. ఇద్దరి కుమా ర్తలకు ఎల్లమ్మ వివాహం చేసి అత్తవారింటికి పంపించింది. అప్పటినుంచి ఆమె ఒంటరిగా ఉంటూ బెల్టుషాపు నడుపుతూ జీవనం సాగిస్తు న్నది.కాగా,బుధవారం అర్థరాత్రి కొందరు వ్యక్తులు ఎల్లమ్మ ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో నుంచి 5తులాల పుస్తెలతాడు, నగదును అపహ రించి పదునైన ఆయుధంతో మెడ భాగంలో కొట్టి హత్య చేసినట్టు పోలీ సులు తెలిపారు.ఎల్లమ్మ సమీప బంధువు ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపా రు.పోస్ట్ మార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.