Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గురువారం హైదరాబాద్లోని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యా లయాలు, ఉన్నత విద్యారంగంపై చర్చించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టిసారించాలని గవర్నర్ ఆదేశించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గవర్నర్కు లింబాద్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ పాల్గొన్నారు.