Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల సమాలోచనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
థర్డ్ వేవ్ రావచ్చనే అంచనాల నేపథ్యంలో ముందుగానే 1,500 మంది వరకు కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని నియమించుకోవాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన నేపథ్యంలో గతేడాది పీజీ పూర్తి చేసిన వారిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకున్న సంగతి తెలిసిందే. ఏడాది గడిచిపోవటంతో ఇక వారి సేవలను నిలిపేయాలనుకున్నారు. అయితే దీపావళి తర్వాత మరోసారి మూడో దశ మహమ్మారి ముప్పు పొంచి ఉంటుందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడు తుండటంతో ముందు జాగ్రత్తగా తాజా పీజీలను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ మరో వారం, 10 రోజుల్లో వెలువడనున్నట్టు తెలిసింది. మరోవైపు కరోనా కట్టడికి సంబంధించి బుధవారం హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమయింది. ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ తాజా పరిస్థితిపై సమీక్షించి, థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. అదే విధంగా చిన్నపిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. నిలోఫర్ తో పాటు జిల్లాల్లో కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మరోవైపు డీఎంఇ పరిధిలో వంద మంది వరకు వివిధ కేడర్లకు చెందిన పీడియాట్రిషియన్లు (చిన్న పిల్లల వైద్య నిపుణులు) ఉండగా, ఆయా విభాగాల్లో ఎంత మంది ఉన్నారు.? అని అడిగి తెలుసుకున్నారు.
సెప్టెంబర్ 26లోగా ఎన్ఎంసీకి ప్రతిపాదనలు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఏడు మెడికల్ కాలేజీలకు సంబంధించి స్థలాలను గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డి రామ గుండంతో పాటు వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో క్షేత్ర స్థాయి పర్య టించి పరిశీలిం చారు. వీటికి సంబంధించిన వివరాలతో సెప్టెం బర్ 26లోగా నేషనల్ మెడికల్ కౌన్సి ల్కు ప్రతి పాద నలు పంపించనున్నారు.