Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11న మెడిసిన్ ఫ్రమ్ ద స్కై ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న ప్రాజెక్టు ప్రారంభించనున్నది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నిటి అయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ (అపొల్లొ హాస్పిటల్స్) భాగస్వామ్యంతో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై (ఆకాశ మార్గంలో ఔషధాలు) అందుబాటులోకి తీసుకురానున్నది. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా వికారాబాద్ జిల్లాకు మొదటి సారిగా వ్యాక్సిన్లను పంపించే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11న మొదలు పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ నిర్వహణ అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వికారాబాద్ చేరుకున్న బ్లూడార్ట్ మెడ్ ఎక్స్ ప్రెస్ కన్సార్టియంతో పాటు ఎంపిక చేసిన ఎనిమిది కన్సార్టియంలు డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే ప్రారం భోత్సవ కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులతో పాటు నిటి ఆయోగ్ సీఈవో, అపొల్లొ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎయిర్ స్పేస్, డ్రోన్స్ ఇండియా విభాగాధిపతి పాల్గొననున్నారు.
ఆకాశ మార్గంలో ఔషధాల ప్రాజెక్టు దేశంలో ఎక్కడా లేదనీ, తొలిసారిగా తెలంగాణలోనే అందుబాటులోకి రానున్నదని రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.