Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వరుసగా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా, ప్రమాదాల బారిన పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులను ఆదేశిం చారు. ఏటూరు నాగారం, భద్రాచలం, మన్న నూరు ఐటీడీఏల పరిధిలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, పాఠశాలల ప్రారంభం, విద్యార్థుల హాజరు, సీజనల్ వ్యాధులపై మంత్రి గురు వారం హైదరాబాద్ లోని డీఎస్ఎస్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు నష్టం రాకుండా చూడాలని అన్నారు.