Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డ్రగ్స్ కేసుపై సమగ్రమైన విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. డ్రగ్స్ మాఫియా, సినీ ప్రముఖులపై ఈడీ విచారణ మంచిపబ్లిసిటీతో రక్తి కట్టిస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్ తయారీదారులను పట్టించుకోవాలని కోరారు. దేశ సరిహదుల్లో ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టడం, డ్రగ్స్ మాఫియాను అణచివేయడం, ఎన్నికల్లో నల్లధనం ఏరులై పారడాన్ని ఆపడమే కర్తవ్యమని నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోడీ ప్రకటించారని గుర్తు చేశారు.అవి నెరవేరాయా?అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈడీ విచారణ కళాకారులను ఏడిపించేదిగా ఉంది తప్ప అసలు మాఫియాను పట్టుకునే దిగా లేదని తెలిపారు.అసలు డ్రగ్స్ తయారు కాకపోతే సరఫరా చేసేవారుంటారా?, తినేవారుంటారా?అని అడిగారు. సంచలనాల విచారణ కన్నా సెన్సిబుల్ విచారణ జరపాలని కోరారు. డ్రగ్ మూలస్తలంభాలపై గురిపెట్టాలని సూచించారు.