Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ డైరెక్టర్కు రేవంత్ ఫిర్యాదు
- ఆధారాలతోసహా వివరాలు సమర్పించిన నేత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కోకపేట భూముల అమ్మకాల్లో వందల కోట్ల అక్రమాలు జరిగాయనీ, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి సీబీఐని కోరారు. ఈమేరకు గురువారం ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్కు భూముల అమ్మకాలపై ఆధారాలతో కూడిన వివరాలను సమర్పించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కోకాపేట భూముల్లో జరిగిన అవినీతిపై ప్రధాని మోడీ, హౌంశాఖ మంత్రి అమిత్షాను కలిసి దీనిపై విచారణ జరిపించాలని కోరనున్నట్టు పేర్కొన్నారు. ఆయా భూముల అమ్మకాల్లో కేసీఆర్ తమ బంధువులకూ, కావాల్సిన వారికి తెలంగాణ జాతి సంపదను కట్టబెట్టారని ఆరోపించారు. రూ 2,500 కోట్ల విలువైన భూముల అమ్మకాల్లో రాష్టానికి రూ 1,500 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను కొల్లగొట్టి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కారనీ, తద్వారా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో రాజకీయ నాయకులను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్కు కావాల్సిన గుప్పెడు మంది కోసం రాష్ట్ర సందపను దోచిపెడుతున్నారని చెప్పారు. కోకాపేట భూముల విక్రయ టెండర్లలో గోల్మాల్ జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారమంతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, జయేష్ రంజన్, అర్వింద్కుమార్, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి కన్నుసన్నల్లో జరిగిందని విమర్శించారు. వీరి పాత్రపై సీబీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మై హౌం, రాజ్పుష్ప సంస్థతోపాటు మహబూబ్నగర్ ఎంపీ శ్రీనివాస్రెడ్డి సోదరుడు మన్నె సత్యనారాయణరెడ్డి భూముల అమ్మకాల్లో ప్రత్యక్ష లబ్ధి పొందారని పేర్కొన్నారు.
కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు అనగలరా?
కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతున్నదంటూ బీజేపీ అధ్యక్షులు బండి సంజరు, కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి పదేపదే మాట్లాడుతున్నారనీ, అయితే ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ దోచుకుంటున్నారనీ, ఆయన్ను జైలుకు పంపిస్తామంటూ ప్రకటనలు చేయడం కాదు...కనీసం విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధాని, హౌంమంత్రి, ఈడీ, సీబీఐకి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు అవినీతి నియంత్రణ పట్ల చిత్తశుద్ధి ఉంటే, రాష్టంలో జరిగిన అవినీతిపై విచారణకు అదేశించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కమలం పార్టీ నేతల పాదయాత్రను ప్రజలను నమ్మబోరని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కు కాకపోతే తాను చేసిన ఫిర్యాదుపై విచారణ కోరాలని డిమాండ్ చేశారు.
ధరణి పోర్టల్ అక్రమాలపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు
అస్తవ్యస్తమైన ధరణి పోర్టల్ అక్రమాలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. ఈ విషయాన్ని గురువారం ఆయన ప్రకటనలో తెలిపారు. ధరణిలో సమస్యలు తలెత్తితే తహసీల్దార్ పరిష్కరించాల్సిందిపోయి..కలెక్టర్కు అధికారాలను అప్పగించారని ఆరోపించారు. రైతులు భూవివాదాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.