Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిష్టిబొమ్మదహనం చేసిన మహిళా కాంగ్రెస్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు విమర్శించారు. పెట్రోల్ ధరలు పెరగడంతో దాని ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పారు. గురువారం హైదరాబాద్లోని నాంపల్లి చౌరస్తాలో కట్టెలపోయి పెట్టి వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు రిక్షా తొక్కి తన నిరసనను వ్యక్తం చేశారు.