Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ల ఎదుట వీఆర్ఏల ధర్నా
నవతెలంగాణ-విలేకరులు
వీఆర్ఏలకు 11వ పీఆర్సీ ప్రకారం పే స్కేల్ పెంచి రూ.19వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని నినదించారు. సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనీ, లేనియెడల ఉద్యమాలు తప్పవని వీఆర్ఏలు, నాయకులు హెచ్చరిం చారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదు ట నిర్వహించిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు మోసంగి అంజయ్య పాల్గొని ప్రసంగిం చారు. భువనగిరిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. వనపర్తిజిల్లా కేంద్రంలో వీఆర్ ఏలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిం చారు. అనంతరం కలెక్టర్ షేక్ యాస్మి న్ బాషాకు వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.