Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ శాంతి కుమారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫారెస్ట్ బీట్ అధికారులు అంకితభావంతో పనిచేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిలుపునిచ్చారు. ఉన్నత విద్యార్హతలున్న వారు అటవీ ఉద్యోగాలకు ఎంపిక కావటంతో పాటు, అటవీ రక్షణ విధుల్లో పాల్గొనటం శుభపరిణామమన్నారు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో 29వ బ్యాచ్ ఫారెస్ట్ బీట్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ గురువారం జరిగింది. 38 మంది ఫారెస్ట్ బీట్ అధికారుల ఆరు నెలల శిక్షణ ముగించుకుని విధుల్లో చేరబోతున్నారు. వారిలో 13 మంది పీజీ, 25 మంది డిగ్రీ చదివినవారు ఉన్నారు. వీరంతా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ద్వారా ఎంపికయ్యారు. ఈ పెరేడ్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం అటవీ రక్షణకు, పచ్చదనం పెంపునకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఎఫ్బీఓలు పనిచేయాలని సూచించారు. పీసీసీఎఫ్ ఆర్.శోభ మాట్లాడుతూ.. అటవీ సంబంధిత విషయాలతో పాటుగా వీరికి వెపన్ ట్రైనింగ్, సర్వే ట్రైనింగ్, జీపు నడపడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో మంచి ప్రతిభ కనపరిచినవారిని ఉన్నతాధికారులు సత్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమంగా పనిచేసిన అటవీ అధికారికి ఇచ్చే కే.వీ.ఎస్ బాబు సంస్మరణ అవార్డును ఈ యేడాది కొత్తగూడెం ఫారెస్ట్ రేంజీ అధికారి సీ.హెచ్. శ్రీనివాసరావు ఎంపికయ్యారు. బంగారు పతకంతో పాటు, 15 వేల రూపాయల రివార్డుతో ఉన్నతాధికారులు ఆయనని సత్కరించారు. అంతకు ముందు స్పెషల్ సీఎస్, పీసీసీఎఫ్, ఇతర అధికారులు కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన తెలంగాణ భాషా అభిమానాన్ని, పోరాటాన్ని, రాజకీయ కార్యశీలతను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆర్.ఎం.డోబ్రియల్, పి.వి.రాజా రావు, బుచ్చిరామ్రెడ్డి., సంగీత, కె. శివ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.