Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రైవర్ శ్రీనివాస్ కూడా..
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
డ్రగ్స్తో పాటు మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ నటుడు రవితేజ, అతని డ్రైవర్ శ్రీనివాస్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురు వారం విచారణ జరిపారు. ఉదయం 10.15 గంటల ప్రాంతంలో రవితేజ, శ్రీని వాస్లు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. వారితో పాటు చార్టర్ అకౌంటెంట్ కూడా ఉన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ రవాణాదారుడు కెల్విన్తో రవితేజకు , శ్రీనివాస్లకు ఉన్న సంబంధాలపైనే ఎక్కువగా ఈడీ అధికారుల దృష్టి నిలిపినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రధానంగా కెల్విన్తో డ్రైవర్ శ్రీనివాస్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అతని ద్వారానే ఇతర సినీ ప్రముఖులకు డ్రగ్స్ పరఫరా జరిగినట్టు ఈడీ అనుమా నిస్తోంది. రవితేజతో పాటు ఇతర నటులు, సాంకేతిక నిపుణులకు డ్రగ్స్ను సరఫరా చేయడంలో కెల్విన్ సక్సెస్ అయ్యాడని భావిస్తున్నది. కాగా రవితేజకు చెందిన బ్యాంకు ఖాతాలను కూడా తెప్పించుకుని ఈడీ అధికారులు కెల్విన్ ఖాతాలకు ఏ మేరకు డబ్బులు బదిలీ చేశారో విచారించారు. అలాగే డ్రైవర్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించిన అధికారులు అతని ద్వారా పెద్ద మొత్తంలోనే డబ్బులు కెల్విన్ ఖాతాలోకి వెళ్లిన ట్టుగా గుర్తించారు. అలాగే ఎఫ్ క్లబ్తో శ్రీనివాస్, రవితేజల కు ఉన్న సంబంధాల గురించి కూడా ఈడీ అధికారులు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. చాలావరకుప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన రవితేజ కొన్నింటికి మాత్రం మౌనమే సమాధాన మైంది. 2017 లో రాష్ట్ర ఎక్సైజ్ పోలీసు విభాగం రవితేజను విచారించిన అం శాలను కూడా ముందుంచుకుని ఈడీ అధికారులు తదుపరి విచారణను కొనసాగించారు. దాదాపు ఆరు గంటల పాటు విచారించిన అధికారులు డ్రైవర్ శ్రీనివాస్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. కాగా నటుడు నందు, దగ్గుబాటి రానాల విచారణ సమయంలో ప్రధాన నిందితుడు కెల్విన్ను సమ క్షంలో ఉంచుకున్నా అధికారులు రవితేజను విచారించే సమ యంలో ఇందుకు భిన్నంగావ్యవహరించారు. 6గంటల పాటు విచారణ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చిన రవితేజ, శ్రీనివాస్లు మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుచి కారు ఎక్కి వెళ్లిపోయారు.