Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ భద్రతా చర్యలు చేపట్టాల్సిందే
- తాత్సారం చేయొద్దు : విద్యుత్ ముఖ్య తనిఖీ అధికారి శ్రీనివాస్రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వినాయకచవితి నేపథ్యంలో మండపాల వద్ద విద్యుత్కు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవా లని విద్యుత్ తనిఖీ ముఖ్య అధికారి ఎస్.శ్రీనివాస్ రావు సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకట న విడుదల చేశారు. సురక్షితంగా పండుగను జరుపుకునేందుకు, అవాంఛనీయ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు మార్గదర్శకాలు, సూచనలను కచ్చితంగా పాటించాలని కోరారు. లైసెన్స్డ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ చేత మాత్రమే విద్యుత్ పనులు చేయించాలనీ, అనుమతించిన వ్యక్తులే విద్యుత్ నిర్వహణ, పర్యవేక్షణ చేయించాలని స్పష్టం చేశారు. అవసరైనంతగా ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్లను ఏర్పాటు చేసుకోవాలనీ, లోడును బట్టి ఇన్ కమింగ్ సర్వీస్ వైర్లు, సబ్ సర్క్యూట్ వైర్లు నిర్దేశిం చిన కొలతల్లోనే ఉండాలనీ, ప్రతి సర్క్యూట్ లోడు 800 వాట్లను మించవద్దని పరిమితి విధించామని తెలిపారు. సింగిల్ ఫేస్ సర్క్యూట్ లో ఫేస్, న్యూట్రల్, ఎర్త్ వైర్లు ఒకేలా ఉండేలా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. లైటింగ్ సర్క్యూట్లకు సిల్క్ వైర్లను ఉపయోగించరాదని ఆదేశించారు. ప్రతి సర్క్యూట్ కు ప్రత్యేకంగా న్యూట్రల్, ఎర్త్ వైర్లు ఉండాలని పేర్కొన్నారు. మండపాల వద్ద స్టౌవ్లు వాడొద్దని సూచించారు. కనెక్షన్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలనీ, సాధ్యమైనంత వరకు జాయింట్లు లేకుండా చూడాలనీ, తప్పనిసరైతే వాటిని ఇన్సూలేషన్ టేప్తో సరైన రీతిలో బిగించాలని సూచించారు. ఎమర్జెన్సీ లైటును కచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఐదు కేజీల అగ్నిమాపకాల సిలిండర్లు, రెండు ఇసుక బకెట్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. విద్యుత్ ఫిట్టింగ్లన్నింటిని 9 అడుగులపైగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. త్రీ పిన్ ప్లగ్గులను ఉపయోగించాలనీ, ఖాళీ చేతులతో విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు. ఫిలమెంట్ లైట్లను మండపాల వద్ద ఉపయోగించవద్దనీ, వాటితో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరించారు.