Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన 30శాతం పీఆర్సీ ఇవ్వాలి
- కనీస వేతనం రూ.21 వేలివ్వాలని డిమాండ్
- రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి
నవతెలంగాణ- విలేకరులు
ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు గురువారం కలెక్టరేట్లను ముట్టడిం చారు. పీఆర్సీకి సంబంధించిన జీవో లను తక్షణమే విడుదల చేసి ప్రభు త్వం మాట నిలబెట్టుకోవాలని, కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణా న్ని పణంగాపెట్టి ప్రజలకు సేవలం దించిన ఆశాలకు న్యాయం చేయాలని తెలంగాణ వాలంటీర్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (సీఐటీ యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సునీత, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ అమలయ్యే విధంగా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆశాలు పెద్దఎత్తున కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వాలంటీర్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సునీత మాట్లాడారు. ఏపీలో మాదిరిగా ఆశాలకు రూ.10వేల ఫిక్స్డ్ వేతనాలివ్వాలన్నారు. ఆశాలకు పనిభారం తగ్గించి.. యూనిఫామ్లు ఇవ్వాలన్నారు. అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం స్మార్ట్ఫోన్లు, రిజిష్టర్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ ఉదరుకుమార్కు వినతిపత్రం అందజేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన, అనంతరం కలెక్టర్ పమేలాసత్పతికి వినతిపత్రం అందజేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆశాలు సీఐటీయూ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ బైటాయించిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్ మాట్లాడారు. అరకొర అలవెన్సులతో దుర్భర జీవితాలు గడుపుతున్న ఆశాల ఆర్తనాదాలు ప్రభుత్వానికి విన్పించడం లేదా అని ప్రశ్నించారు. ఆశా కార్యకర్తలకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలు నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గాంధీపార్క్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిబాబు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలన్నారు. లేదంటే వారికి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్ సిక్తా పట్నాయక్కు వినతిపత్రం అందించారు. మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్.నీరజ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ఆశా కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ ఖమ్మం ధర్నాచౌక్లో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట, వాగ్వివాదం జరిగింది. అనంతరం అదనపు కలెక్టర్ మధుసూదన్కు వినతిపత్రం అందజేశారు. ధర్నా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి వేణు సంఘీభావం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆశాలు ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆశాలు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. నిజామాబాద్లో రాజీవ్గాంధీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట దాదాపు నాలుగు గంటలపాటు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ ఏవో రవీందర్ ఫిర్యాదు తీసుకోకపోవడంతో కలెక్టర్ కార్యాలయం గేటుకు వినతిపత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేశారు. విశ్వనగరం వంటి హైదరాబాద్లో రూ.7200 వేతనంతో ఆశాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాకుంటే ప్రగతి భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.