Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ- ములుగు
ఇటీవల వర్షాలతో రామప్ప చెరువు కింద పంట పొలాలు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని ములుగు, జంగాలపల్లి మేడివాగు జాతీయ రహదారిపై శనివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామప్ప చెరువు పరిధిలోని ఇంచర్ల, జంగాలపల్లి, నర్సాపూర్, బరిగలానిపల్లి, పాల్సాబ్ పల్లి, బండారుపల్లి గ్రామాల ప్రజల పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయని తెలిపారు. దీంతో రైతులు నష్టపోయారని వివరించారు. అధికారులు పంట నష్టంపై సర్వే చేసి పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపించాలన్నారు. తద్వారా రైతులకు నష్టపరిహారం చెల్లించాని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు చేపడుతామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, ములుగు మండల అధ్యక్షుడు చాంద్పాషా, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు కంబాల రవి, సహకార సంఘ అధ్యక్షుడు బొక్క సత్తిరెడ్డి, సహకార సంఘ ఉపాధ్యక్షుడు మర్రి రాజు, రైతులు పాల్గొన్నారు.