Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళన చెందుతున్న విద్యార్థులు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాలలో కరోనా కలకలం రేపింది. శనివారం అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కళాశాల ప్రారంభమైన వారం రోజులకే పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సింగరేణి మహిళా జూనియర్, డిగ్రీ కళాశాలల్లో వందలాది మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాలైన వివిధ జిల్లాలకు చెందిన కార్మికుల పిల్లలు, కార్మికేతర పిల్లలు ఈ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. మందమర్రి, బెల్లంపల్లి, రామగుండం, మంచిర్యాల, శ్రీరాంపూర్, మణుగూరు, ఇల్లందు, గోలేట్ ప్రాంతాలతోపాటు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోని వసతి గృహంలో ఉంటున్నారు.