Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోనీ బీసీ గురుకులాల్లో విద్యాభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని పీడీఎస్యూ(వీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ బాపురావు, ప్రధాన కార్యదర్శి కోట ఆనంద్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో ఎంత మంది బీసీ గురుకుల విద్యార్థులు ర్యాంకులు సాధించారో ప్రకటించాలని కోరారు. విద్యాబోధనపై అధికారులు, ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఎన్నో అక్రమాలకు బీసీ గురుకులాలు నిలయమయ్యాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు ప్రారంభించకపోవడంతో బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల చదువులు నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిలో కనీస సదుపాయాలు కల్పించి బోధన ప్రారంభించాలనీ, లేదంటే నిరసనలు చేపడతామని తెలిపారు.