Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినోద్కుమార్కు ఎస్జీటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని నియమించాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (ఎస్జీటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్కుమార్ను శనివారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరివేద మహిపాల్రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల దశరథ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్జీటీలను ఉన్నత పాఠశాలలకు డిప్యూటేషన్ చేయొద్దని కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని వివరించారు. విద్యావాలంటీర్లను, ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులను నియమించాలని పేర్కొన్నారు. దీనికి స్పందించిన వినోద్కుమార్ గ్రామపంచాయతీల నుంచి పూర్తిస్థాయిలో ఒక సర్వీస్ పర్సన్ను డిప్యూట్ చేయిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే విద్యావాలంటీర్లను నియమిస్తామని వివరించారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు త్వరలోనే జరుగుతాయని తెలిపారు. ఈ అంశాలపై పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనతో మాట్లాడారని పేర్కొన్నారు.