Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 157 ప్రయివేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు
- కన్వీనర్ కోటాలో 65,219 సీట్లు
- వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో 172 ఇంజినీరింగ్ కాలేజీల్లో 91,607 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటాలో 65,219 సీట్లున్నాన్నాయి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 157 ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రకటించామని తెలిపారు. వాటిలో 87,962 సీట్లున్నాయని వివరించారు. విశ్వవిద్యాలయాల పరిధిలో 15 ప్రభుత్వ కాలేజీల్లో 3,645 సీట్లున్నాయని పేర్కొన్నారు. బీ ఫార్మసీ కోర్సుకు సంబంధించి 112 కాలేజీల్లో 4,550 సీట్లున్నాయని వివరించారు. విశ్వవిద్యాలయాల పరిధిలో మూడు ప్రభుత్వ కాలేజీల్లో 80 సీట్లు, 109 ప్రయివేటు కాలేజీల్లో 4,470 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఫార్మాడీ కోర్సులో 53 ప్రయివేటు కాలేజీల్లో 41 సీట్లున్నాయనీ, ఇందులో కన్వీనర్ కోటాలో 520 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు. ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ గడువును ఈనెల 13 వరకు పొడిగించామని తెలిపారు. వెబ్ఆప్షన్ల నమోదుకు ఈనెల 16 వరకు గడువుందని పేర్కొన్నారు.
జేఎన్టీయూలో ఏడు కాలేజీలకు గుర్తింపు నిరాకరణ
ప్రస్తుత విద్యాసంవత్సరంలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో 148 ఇంజినీరింగ్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాయి. వాటిలో 89,400 సీట్లకు అనుమతి ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలు కోరాయి. కానీ ప్రస్తుత విద్యాసంవత్సరంలో 141 ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలకు మాత్రమే జేఎన్టీయూ హైదరాబాద్అనుబంధ గుర్తింపు ప్రకటించింది. అంటే ఏడు కాలేజీలకు గుర్తింపును నిరాకరించింది. 11,402 సీట్లకు కోత విధించింది. అన్ని కాలేజీల్లోనూ ఇటీవల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. కాలేజీల్లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని యాజమాన్యాలను వర్సిటీ అధికారులు కోరారు.