Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేశ్కుమార్గౌడ్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈనెల 13న టీపీసీసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి అధ్యక్షతన శనివారం జూమ్మీటింగ్లో కార్యవర్గ సమావేశం జరిగింది.తాజా రాజకీయాలు, దండోరాసభలు చర్చించారు. అందులో తీసుకున్న నిర్ణయాలను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి టీపీసీసీ కార్యవర్గంతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీఎల్పీ నేత, గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా నియోజకవర్గ సమన్వయ కర్తలు, పార్టీ నాయకులు హాజరు కావాలని కోరారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఈనెల 17న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ జరుగుతున్నదని తెలిపారు.