Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా సదస్సులో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఐద్వా సదస్సు డిమాండ్ చేసింది. సుదీర్ఘకాలంగా ఈ బిల్లు చట్టసభల్లో పెండింగ్ ఉన్నదని వివరించారు. ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కెఎన్ ఆశాలత అధ్యక్షతన ''చట్ట సభల్లో మహిళా బిల్లు ఆమోదానికి ఇంకా ఎన్నాళ్లు?'' అంశంపై సదస్సు జరిగింది. ప్రొఫెసర్ లక్ష్మి (ఉస్మానియా యూనివర్సిటీ), ఐద్వా కార్యదర్శి మల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో వందేండ్ల మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభలో మహిళా బిల్లును ఆమోదించారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకాభిప్రాయం లేదంటూ ఆ బిల్లును వెనక్కి నెట్టేశారని చెప్పారు. అదే సందర్భంలో తమకు అవసరమైన కొన్ని చట్టాలను పార్లమెంట్ లో ఏకపక్షంగా ఆమోదింప చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి మహిళలు, వారి సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. చిన్న చిన్న దేశాలు సైతం మహిళా రిజర్వేషన్ కల్పించి, అభివద్ధికి పాటుపడు తుంటే.. భారతదేశంలో మహిళల స్థితిగతులు రోజురోజుకూ దిగజారుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయపార్టీలన్నీ మహిళలకు సమాన అవకాశాలు కల్పించి చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచాలని డిమాండ్ చేశారు.